ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మడికి అంతర్‌రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ సమయాలు మార్పు

ABN, Publish Date - Apr 01 , 2025 | 12:36 AM

ఆలమూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి నాలుగు లైన్ల జాతీయ రహదారికి చెంత ఉన్న అంతర్‌రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ వేళలను మార్పు చేసినట్టు మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు పాలూరి సత్తిబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 5 గంటల నుం

ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండుసార్లు నిర్వహణ

ఆలమూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి నాలుగు లైన్ల జాతీయ రహదారికి చెంత ఉన్న అంతర్‌రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ వేళలను మార్పు చేసినట్టు మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు పాలూరి సత్తిబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి మార్కెట్‌లో కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. మధ్యాహ్నం 1గంట నుంచి మార్కెట్‌ తిరిగి ప్రారంభై 5గంటల వరకు జరుగతుంది. రోజుకు రెండుసార్లు ఈ మార్కెట్‌ నిర్వహిస్తా రు. మారిన వేళలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని సత్తిబాబు తెలిపారు. ఈవేళలు పా టించకుండా రైతులు లేదా వ్యాపారులు మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోలు చేస్తే రూ.2వేలు జరిమానా విధిస్తున్నట్టు హెచ్చరించారు. ఇప్ప టివరకు మార్కెట్‌లో వేలాపాల లేకపోవడం వల్ల అటు రైతులు, ఇటు కొనుగోలుదారులకు సమన్వయం కుదరక నష్టం వాటిల్లుతుంది. ఈ విషయాన్ని గుర్తించి మార్కెట్‌ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మార్కెట్‌కు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్దఎత్తున కూరగాయలను రైతులు తీసుకొస్తారు. వ్యాపారస్తులు కూడా వివిధ జిల్లాలు, దూరప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. కచ్చితమైన సమయాలు ఇప్పటివరకు పాటించకపోవడం వల్ల రైతులు ఎప్పుడూ కూరగాయలు తేవాలో కొనుగోలుదారులు ఎప్పుడు రావాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అందుకనే ఈ సమయాలను నిర్ణయించామని, ఆ సమయాల్లోనే అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయని మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు సత్తిబాబు వివరించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రైతులు, వ్యాపారస్తులు వేళలను గుర్తించాలని కోరారు.

Updated Date - Apr 01 , 2025 | 12:36 AM