Ravichettu: చెట్టుకు పూసిన పక్షులు
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:03 AM
విశాఖపట్నం సింహగిరి ఘాట్రోడ్డు వద్ద ఉన్న రావిచెట్టు వందలాది పక్షుల ఆవాసంగా మారింది. కొంగలు, పావురాలు, కాకులు కలిసి ఈ చెట్టుపై జీవిస్తున్నాయి, రోజంతా ఆహారాన్వేషణకు వెళ్లి సాయంత్రం తిరిగి చేరుకుంటున్నాయి.

ఇవి చెట్టుకు పూసిన పక్షులు! చెట్టు నిండుగా తెల్లటి పూలు ఉన్నట్టుంది కదా!! కానే కాదు. ఈ ఫొటోలో అరవిరిసిన పుష్పాలుగా గోచరించేవన్నీ పక్షులే. విశాఖపట్నం సింహగిరి ఘాట్రోడ్డు టోల్గేటు సమీపంలో ఉన్న రావిచెట్టు వందలాది పక్షులకు ఆవాసంగా మారింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా ఈ చెట్టు మీద కొంగలు, పావురాలు, కాకులు కలిసి మెలిసి జీవిస్తున్నాయి. వందల సంఖ్యలో ఈ పక్షులన్నీ సూర్యోదయాన ఒక్కసారిగా ఆహారాన్వేషణకు బయలుదేరడం, తిరిగి సాయంత్రం చెట్టుమీదకు చేరడాన్ని వీక్షించే వారంతా మధురానుభూతి చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..