IIT Medical Academy: ఐఐటీ విద్యార్థులు ఆందోళన

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:42 PM

ఐఐటీ మెడికల్ అకాడమీ మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొన­సా­గి­స్తేనే విద్యార్థులకు మె­రు­గైన వి­ద్య, భవిష్యత్‌ భద్రంగా ఉంటుందని అంటున్నారు.

IIT Medical Academy: ఐఐటీ విద్యార్థులు ఆందోళన
IIT Medical Academy

కృష్ణా జిల్లా: ఈడుపుగల్లు (Eedupugallu)లో ఐఐటీ విద్యార్థులు (IIT students) ఆందోళనకు (Protest0 దిగారు. ఐఐటీ మెడికల్ అకాడమీ (IIT Medical Academy) మూసివేస్తూ (closure) విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో 6 వందల మంది మొదటి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే అకాడమీ యాజమాన్యం మాత్రం ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మరో ఐఐటీ క్యాంపస్‌లోకి తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఈడుపుగల్లు ఐఐటీ మెడికల్ అకాడమీలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Also Read..:

ఈ సమయంలో వైసీపీ గురించి అవసరమా..


రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల వి­ద్యా­లయాల సంస్థ ఐఐటీ–మెడికల్‌ అకాడమీలు మూ­డు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లా ఈడు­పు­గల్లు, క­ర్నూ­లు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కె­ళ్ల­పాడు ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. చిన్న­టే­కూ­రు, అడవి తక్కెళ్లపాడు రెండు అకాడమీలు బాలురకు, ఈడుపుగల్లు అకాడమీ ప్ర­త్యే­కించి బాలికలకు ఏర్పాటు చేశారు. 2017లో ఏ­ర్పా­టై­న ఈ కేంద్రంలో ప్రస్తుతం 500 మందికి పైగా వి­ద్య­న­భ్యసి­స్తు­న్నారు.


న్యాయ పోరాటానికి సిద్ధం..

ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లి­దండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొన­సా­గి­స్తేనే విద్యార్థులకు మె­రు­గైన వి­ద్య, భవిష్యత్‌ భద్రంగా ఉంటుందని అంటున్నారు. అధి­కా­రులు తమ ఆవేదన అర్థం చేసు­కోవా­లని కోరు­తు­న్నారు. అకా­డ­మీ­ని కొన­సాగించేలా వి­ద్యా­­ర్థులతో పాటు వారి తల్లిదండ్రులు న్యా­య­పో­రాటా­నికి దిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ షాపులన్నీ అక్రమమైనవని తెలిసినా..

శంషాబాద్‌కా.. వామ్మో అంటున్న క్యాబ్ డ్రైవర్లు..

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 01:43 PM