AP Hajj Committee Chairman: ఏపీ హజ్ కమిటీ చైర్మన్గా షేక్ హసన్ భాషా
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:08 AM
ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్గా షేక్ హసన్ భాషాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గుంటూరుకు చెందిన హసన్ భాషా టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు

అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్గా షేక్ హసన్ భాషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరుకు చెందిన హసన్ భాషా సుదీర్ఘకాలంగా టీడీపీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో రిసెప్షన్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో హసన్ భాషా ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్గా పనిచేశారు.