Share News

Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..

ABN , Publish Date - Apr 09 , 2025 | 07:15 AM

తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ. 8,224 కాగా 10 గ్రాముల ధర రూ. 82,249గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ. 8,972 కాగా 10 గ్రాముల ధర రూ. 89,720గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Today Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు..
Today Gold Rate

బిజినెస్ న్యూస్: బంగారం (Gold) ధర గడచిన నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల్లో ఏకంగా రూ. 3 వేలకుపైగా తగ్గింది (Gold Price Drop). మరింతగా పడిపోతుందన్న వార్తలు నిజమేనా.. గోల్డ్ ధర తులం రూ. 56 వేలకు (Gold Rate Rs. 56,000) వచ్చేస్తుంది.. మరో 40 శాతం ధరలు తగ్గుతాయా.. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పోయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంగారు ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి పరుగు ఆగింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 17 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. ఇక్కడి నుంచి బంగారం ధర రూ. లక్ష దిశగా దూసుకువెళుతున్న సమయంలో ఆగింది. ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట టారిఫ్‌ను పెంచినప్పటి నుంచి కూడా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్నాయి.

Also Read..: H-1B visa: అమెరికా.. కలలు కల్లలు


తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ. 8,224 కాగా 10 గ్రాముల ధర రూ. 82,249గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ. 8,972 కాగా 10 గ్రాముల ధర రూ. 89,720గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

కోల్‌కతా- రూ. 82,240, రూ.89,720

చెన్నై- రూ. 82,240, రూ.89,720

బెంగళూరు- రూ. 82,240, రూ.89,720

పుణె- రూ. 82,240, రూ.89,720

అహ్మదాబాద్- రూ. 82,290, రూ.89,770

భోపాల్- రూ. 82,290, రూ.89,770

కోయంబత్తూర్- రూ. 82,240, రూ.89,720

పట్నా- రూ. 82,290, రూ.89,770

సూరత్- రూ. 82,290, రూ.89,770

పుదుచ్చెరి- రూ. 82,240, రూ.89,720


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెంది. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈ మ‌ధ్య వివాహ వేడుక‌ల్లో కూడా బంగారం త‌ర్వాత వెండికే ప్రాధాన్య‌త‌ ఇస్తున్నారు. అలాంటి వెండి కొనేముందు మార్కెట్ ధ‌రలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవ‌డం ముఖ్యం. ఇప్పుడు బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశంలోని వివిధ న‌గరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్క‌డ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 1,02,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 93,900గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి రూ.93,900 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,02,900గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,02,900 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పీ4 పటిష్ఠ అమలుకు ప్రత్యేక సొసైటీ

వచ్చేస్తోంది ‘కొత్త మద్యం’

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 07:15 AM