ఇండిగోకు రూ.944 కోట్ల పెనాల్టీ
ABN, Publish Date - Mar 31 , 2025 | 05:38 AM
విమానయాన సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు (ఇండిగో) ఆదాయ పన్ను శాఖ 2021-22 అసె్సమెంట్ సంవత్సరానికి రూ.944.20 కోట్ల జరిమానా...
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు (ఇండిగో) ఆదాయ పన్ను శాఖ 2021-22 అసె్సమెంట్ సంవత్సరానికి రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. శనివారం ఈ ఉత్తర్వులు అందాయని, వాటిని న్యాయస్థానంలో సవాలు చేయనున్నామని ఇండిగో ప్రకటించింది. అలాగే దీని ప్రభావం తమ ఆర్థిక స్థితిపై గాని, నిర్వహణపై గాని కంపెనీ ఇతర కార్యకలాపాలపై గాని ఉండబోదని తేల్చి చెప్పింది.
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 31 , 2025 | 05:38 AM