జానకి పులపర్తికి ఫోర్బ్స్ అండర్ 40 లీడర్స్ పురస్కారం
ABN, Publish Date - Mar 14 , 2025 | 04:10 AM
ఏఐ ఆధారిత డ్రోన్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా ఉన్న అకిన్ అనలిటిక్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ జానకి పులపర్తి 2025 సంవత్సరానికి...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఏఐ ఆధారిత డ్రోన్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా ఉన్న అకిన్ అనలిటిక్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ జానకి పులపర్తి 2025 సంవత్సరానికి ఫోర్బ్స్ 40 అండర్ 40 లీడర్స్ పురస్కారానికి ఎంపికయ్యారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి గల బాలిక స్థాయి నుంచి డీప్ టెక్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమె ఎదిగిన తీరుకు ఈ పురస్కారం ఒక గుర్తింపుగా భావించవచ్చు. 2022లో అకిన్ టెక్నాలజీస్ను ప్రారంభించిన ఆమె.. సైనికులను క్షేత్రస్థాయి లో అప్రమత్తం చేసే 125 గ్రాముల బరువుండే నానో రెకాన్ డ్రోన్ను అందించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నమో డ్రోన్ దీదీ కార్యక్రమానికి ఉత్తేజితురాలై గ్రామీణ రైతులకు సహాయపడేందుకు ఏఐ ఆధారిత డ్రోన్ స్ర్పేయింగ్ వ్యవస్థను అందించారు.
ఇవి కూడా చదవండి:
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 14 , 2025 | 04:38 AM