Spiritual Moment: అయోధ్య రాముడికి సూర్య తిలకం
ABN, Publish Date - Apr 07 , 2025 | 03:55 AM
శ్రీరామనవమి రోజున అయోధ్య రామమందిరంలో మధ్యాహ్నం 12గంటలకు రాముడి విగ్రహ నుదిటిపై సూర్య తిలకం ప్రదర్శితమైంది. ఈ ఆధ్యాత్మిక దృశ్యం నాలుగు నిమిషాల పాటు కొనసాగగా, వేలాది మంది భక్తులు దీన్ని తిలకించి ఆనందించారు.

రామ మందిరంలో ఆవిష్కృతమైన సుందర దృశ్యం
అయోధ్య, ఏప్రిల్ 6: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం అయోధ్యలోని రామమందిరంలో మనోహర దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. బాల రాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతమయింది. సరిగ్గా మధ్యాహ్నం 12గంటలకు సూర్య కిరణాలు రామ విగ్రహం నుదిటిని తాకాయని, 4నిమిషాల పాటు ఆ దృశ్యం కొనసాగిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సూర్యకాంతితో రాముడికి మహా మస్తకాభిషేకం జరిగిందని తెలిపింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనియాలతో చేసిన ప్రసాదాన్ని, ఫలాలతో చేసిన లడ్డూలను స్వామికి నివేదించారు.
ఇవి కూడా చదవండి:
జెలెన్స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News
Updated Date - Apr 07 , 2025 | 03:57 AM