వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి

ABN, Publish Date - Mar 12 , 2025 | 11:20 PM

ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్‌, రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యా ర్థులు వందకు వంద శాతం ఉత్తీ ర్ణతకు కృషి చేయాలని జిల్లా వి ద్యా శాఖ అధికారి గోవిందరాజులు అన్నారు.

వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి
కేజీబీవీలో విద్యార్థినులతో మాట్లాడుతున్న డీఈవో

- డీఈవో గోవిందరాజులు

కృష్ణ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్‌, రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యా ర్థులు వందకు వంద శాతం ఉత్తీ ర్ణతకు కృషి చేయాలని జిల్లా వి ద్యా శాఖ అధికారి గోవిందరాజులు అన్నారు. మండల పరిధిలోని కేజీబీవీ ఇంగ్లిష్‌ మీడియం బాలికల పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వి ద్యార్థినులతో ఆయన మాట్లాడారు. పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యా లను చేరుకోవడానికి పట్టుదలతో శ్రమించాలని అన్నారు. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి, ఉత్తమ ఫలితాల సాధనకు దోహదపడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎంఈవో నిజాముద్దీన్‌, ఎండీఎం ఇన్‌చార్జి యాదయ్యశెట్టి, జీసీడీవో నర్మద, సీఆర్‌పీ అమీన్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:20 PM