Home » CV Anand
ఈ నెల 12న జరిగే హనుమాన్ విజయోత్సవ ర్యాలీకి 17 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీని ప్రశాంతంగా నిర్దహించుకోవాలని, ఎక్కడా ఎటువంటి ఆవాంచనీ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టామన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. నవమికి మొత్తం 20 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని సీపీ తెలిపారు.
CP CV Anand : శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రతి ఏడాది హైదరాబాద్లో అంగరంగా వైభవంగా శోభయాత్ర సాగుతోంది. ఈ ఏడాది కూడా శ్రీరామ శోభాయాత్ర కో ఆర్డినేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ వీరితో గురువారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.
లైసెన్స్డ్ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లలో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఆయప ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్డ్ తుపాకులు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
seethakka International Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు మంచి స్ట్రెంత్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు.
పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు చేసినా.. కాసుల కోసం కేసులను పక్కదారిపట్టించి సెటిల్మెంట్లకు పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) హెచ్చరించినట్లు తెలిసింది.
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad City Police Commissioner CV Anand) స్పష్టం చేశారు.
ఇంటి పనిమనుషుల పూర్తి వివరాలు యజమానులు కచ్చితంగా తెలుసుకోవాలని నగర సీపీ సీవీ ఆనంద్(City CP CV Anand) అన్నారు. యజమానులు కోరితే పనివారి గురించి పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ చేసి పోలీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు కొందరు బ్యాంకు ఉద్యోగులు దన్నుగా ఉంటున్నారు. ఖాతా వివరాలు అడిగో.. ఓటీపీ నంబరు అడిగో... లేదంటే డిజిటల్ అరెస్టు అయ్యారని భయపెట్టో అమాయక ప్రజలను మోసం చేసి..
పెరుగుతున్న సైబర్ నేరాల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేగంగా స్పందించడం అవసరమని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) అన్నారు. డిజిటల్ మోసాలు అంశంపై ఆర్బీఐ అధికారులు, పోలీసుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం మంగళవారం జరగ్గా.. సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు.