Home » Holy Festival
శుక్రవారం సాయంత్రానికి కల్లా 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా, ఈ ఒక్కరోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ సర్కార్ ప్రకటించింది. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.