Home » Puttaparthi
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచే స్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నా రు. వారు సోమవారం మండలంలోని ఆర్ అనంతపురంలో బ్లాక్ ప్లాం టేషన కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్ర మంలో పాల్గొన్నారు. అనంతరం బుళ్ళస ముద్రం గ్రామంలో జనసేన నాయకు లు ఏర్పాటుచేసిన ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్ జన్మదిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా హిందూపురం ప్రసిద్ధి. కర్ణాటక రాజధాని బెంగళూరు దగ్గరగా ఉండటంతో వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారింది. అయితే అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉంది. పట్టణంలోని ప్రముఖ ప్రాంతాలైన టీచర్చ్ కాలనీ, హౌసింగ్బోర్డు, కరెంటు రంగప్ప లే అవుట్, డీఆర్ కాలనీ, శ్రీకంఠపురం పాత ఊరు, సీపీఐ కాలనీ పక్కన తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన స్థానిక మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తమకొద్దని టీడీపీ ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షు డు కేశగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గాంధీనగర్లోని టీడీపీ స్థానిక కార్యాలయం లో ఆదివారం ఆయన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన మల్లికార్జున గతంలో టీడీపీ శ్రేణులకు పూర్తిగా వ్యతిరేకంగా, వైసీపీ నాయకులకు అనుకూ
సత్యసాయి విద్యార్థులు భక్తిగీతాలాపన భక్తులను అలరింపజేసింది. శ్రీసత్యసాయి మీడియా సెంటర్ 23వ వార్షికోత్సవాన్ని ఆదివా రం ప్రశాంతినిలయంలో ఘనంగా నిర్వహించారు. మొదట విద్యార్థుల వేద పఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మండలకేంద్రంలో ఎక్కడ చూసినా చిత్తడి చిత్తడిగా మారింది. ప్రధాన రహదారులైన ధర్మవరంరోడ్డు, తాడిపత్రిరోడ్డుతో పాటు వీధులన్నీ నీరు నిలిచి బరదమయంగా మారాయి. నీరు నిలిచినచోట దుర్వాసన వెద జల్లుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
పాత పెన్షన విధానం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ విధానాలు తమకు అమోదయోగ్యం కాదని ఏపీటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పెన్షన విద్రోహ చీకటి దినంగా అభివ ర్ణిస్తూ ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాముడు, సానే రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
పట్టణంలోని శివానగర్లోవెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శ్రావణ మాస చివరి శనివారం పూజలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్కు అభిషేకాలు చేశారు. పూలు, తులసి తమలపాకులు, వడమాలతో అలంకరించారు.
మండలంలోని లింగారెడ్డిపల్లికి చెందిన గొర్రెల కాపరి శ్రీరాములు ఆత్మహత్యకు కారుకులను వెంటనే అరెస్టు చేయాలని మృతుడి భార్య భారతి, కుటుంబసభ్యులు, కురుబసంఘం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని మూడురోజులు అవుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం చేస్తున్నారంటూ వారు శనివారం మండలకేం ద్రంలోని రోడ్ల కూడలిలో రోడ్డు పై బైఠాయించి ఆందోళనకు దిగారు.
మండల కేంద్రంలోని సత్యసాయి వాటర్ సప్లై ప్లాంటు వద్ద సత్యసాయికార్మికులు చేపట్టిన నిరసన దీక్ష శనివా రం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.... తమకు గౌరవ వేతనం ఆర్నెల్ల నుంచి అందించకపోవడంతో కుటుం బాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మట్టిని తింటూ నిరసన తెలిపారు.
నల్లమాడ మండలంలోని ఎర్రవంకపల్లి, వేళ్లమద్ది, రెడ్డిపల్లి, నల్లశింగయ్యగారిపల్లి, దొన్నికోట, పులగంపల్లి గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. టీడీపీ మండల కన్వీనర్ మైలేశివశంకర్, నాయకులు కేశవరెడ్డి, వెంకటరమణనాయుడు, గంగులప్పనాయుడు, పెద్దప్పయ్యనాయుడు, సర్పంచ ప్రభాకర్రెడ్డి, కులశేఖర్నాయుడు, రాజారెడ్డి, బుట్టి నాగభూషణనాయుడు, ప్ర సాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.