వినేశ్‌, అన్షు, దివ్యకు స్వర్ణాలు

ABN , First Publish Date - 2021-04-17T09:00:34+05:30 IST

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగట్‌, యువ సంచలనం అన్షూమాలిక్‌, దివ్యా కక్రాన్‌ పసిడి పతకాలతో మెరిశారు.

వినేశ్‌, అన్షు, దివ్యకు స్వర్ణాలు

ఆల్మాటి: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత స్టార్‌ వినేశ్‌ ఫొగట్‌, యువ సంచలనం అన్షూమాలిక్‌, దివ్యా కక్రాన్‌ పసిడి పతకాలతో మెరిశారు. కజకిస్థాన్‌లో శుక్రవారం జరిగిన 53 కిలోల ఫైనల్లో వినేశ్‌ 6-0తో తైపీకి చెందిన మెంగ్‌ హువాన్‌ను చిత్తుచేసి టైటిల్‌ సాధించింది. ఈ చాంపియన్‌షి్‌పలో గతంలో 3 రజత, 4 కాంస్య పతకాలు నెగ్గిన వినేశ్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక 57 కి. విభాగం తుది పోరులో 19 ఏళ్ల అన్షు 3-0తో బటెస్టెగ్‌ (మంగోలియా)పై నెగ్గి ఈ టోర్నీలో మొదటి స్వర్ణాన్ని అందుకుంది. 72 కి. విభాగంలో దివ్యా కక్రాన్‌ 2-0తో కొరియా రెజ్లర్‌ సుజిన్‌ పార్క్‌ను ఓడించి విజేతగా నిలిచింది. 65 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన సాక్షి మాలిక్‌ చివరకు రజతంతో సరిపెట్టుకుంది. సాక్షి ఫైనల్లో బొలొర్‌టుంగలాల్‌ (మంగోలియా) చేతిలో ఓడింది.

Updated Date - 2021-04-17T09:00:34+05:30 IST