ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nimmala Ramanaidu : జగన్ సైకో బుద్ధితో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు

ABN, First Publish Date - 2023-09-14T12:47:12+05:30

చంద్రబాబునాయుడు హయాంలో ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల పనితీరుకు మెచ్చి కేంద్రం బంగారు పథకాన్ని ప్రకటించిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 2018లో జగన్ ఈ అవార్డును అందుకుని దీనిని తాను చేసిన గొప్పగా ప్రచారం చేసుకున్నారన్నారు.

కాకినాడ : చంద్రబాబునాయుడు హయాంలో ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల పనితీరుకు మెచ్చి కేంద్రం బంగారు పథకాన్ని ప్రకటించిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. 2018లో జగన్ ఈ అవార్డును అందుకుని దీనిని తాను చేసిన గొప్పగా ప్రచారం చేసుకున్నారన్నారు. వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో అవకతవకలు లేకున్నా అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. తాను జైలుకి వెళ్లాను కాబట్టి అందరూ వెళ్లాలనే సైకో బుద్ధితోనే రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని రామానాయుడు పేర్కొన్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు చంద్రబాబుకు మద్దతు పలకడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన సంయుక్త పోరాటాలకు సిద్ధం కావాలని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-14T12:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising