ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhulipalla Narendra: నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు

ABN, First Publish Date - 2023-09-10T20:59:49+05:30

ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికారమదం... అహంకారంతో పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదేనని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) అన్నారు.

అమరావతి: ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికారమదం... అహంకారంతో పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదేనని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్(Dhulipalla Narendra) అన్నారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘పాలకుడు అవినీతిపరుడైతే నీతిమంతులు జైలు పాలవుతారు అనడానికి చంద్రబాబు (Chandrababu) రిమాండే నిదర్శనం.నేడు ప్రజాస్వామ్యానికి చీకటిరోజు. అధర్మం గెలిస్తే, ధర్మం ఓడింది. కోడికత్తి కేసు, సీబీఐ.. ఈడీ కేసుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan reddy) రొమ్ము విరిచి నిలబడలేదేం సజ్జలా? కేసుల విచారణకు హాజరుకాకుండా తప్పుడు ఛార్జ్‌షీట్లు వేస్తూ జగన్‌రెడ్డి ఎందుకు తప్పించుకుంటున్నాడు? పోలీసులను దారుణంగా ధూషించిన మంత్రులు, వైసీపీ నేతల సజ్జలకు గుర్తులేరా? వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలికే పనిచేసే పోలీసు అధికారులపై టీడీపీ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, పాలకులు ఎంతగా విర్రవీగినా అంతిమ విజయం ధర్మానిదే.చంద్రబాబుపై జరుగుతున్న కుట్రలను తిప్పికొడుతూ, లోకేశ్ నేత్రత్వంలో న్యాయపోరాటం చేసి, మన నాయకుడిని ప్రజాక్షేత్రంలో గెలిపిద్దాం.తెలుగుజాతి ఔన్నత్యం, తెలుగువారి కీర్తి ప్రతిష్టల కోసం పనిచేసే చంద్రబాబునాయుడే ఎప్పటికైనా విజయం సాధిస్తారు’’ అని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

Updated Date - 2023-09-10T20:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising