ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dhulipalla Narendra: రోడ్డు విస్తరణ పేరుతో పొన్నూరు ప్రజలను భయపెడితే ఊరుకోం

ABN, First Publish Date - 2023-07-27T15:27:19+05:30

భవన యజమానులను భయపెట్టి, దౌర్జన్యం చేసి రోడ్ విస్తరణ పనులు చేపడతారా?, ఎమ్మెల్యే కిలారి రోశయ్య రోడ్డు విస్తరణ పనులు రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏమెచ్చిందో చెప్పాలి. భవన యజమానులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు.

గుంటూరు: పొన్నూరు పట్టణ అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భవన యజమానులను భయపెట్టి, దౌర్జన్యం చేసి రోడ్ విస్తరణ పనులు చేపడతారా?, ఎమ్మెల్యే కిలారి రోశయ్య రోడ్డు విస్తరణ పనులు రహస్యంగా చేపట్టాల్సిన అవసరం ఏమెచ్చిందో చెప్పాలి. భవన యజమానులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. నష్ట పరిహారం విషయంలో భవన యజమానులను తప్పుదారి పట్టిస్తున్నారు. రోడ్ విస్తరణ పనుల్లో అధికార పార్టీ నాయకులకు సంబంధించిన భవనాలకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అధికారాన్ని అడ్డుపెట్టుుకొని భవన యజమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విధమైన చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం. భయపెట్టి పనులు చేయాలని చూస్తే పొన్నూరు ప్రజలు కాళ్ల కింద వేసి తొక్కుతారు. రోడ్ విస్తరణలో ఉన్న అధికార పార్టీ నాయకులకు చెందిన భవనాలను కూడా తొలగించాలి. రోడ్ విస్తరణలో భూమి నష్టపోయే వారికి నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించాలి.’’ అని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-27T15:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising