ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Leaders: ధర్మాగ్రహ శాంతి ర్యాలీ చేసి తీరుతాం..

ABN, First Publish Date - 2023-10-07T10:52:13+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మాగ్రహ శాంతి ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ధర్మాగ్రహ శాంతి ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు (TDP Leader GV Anjaneyulu) మాట్లాడుతూ... సాయంత్రం గుంటూరులో శాంతి ర్యాలీ చేసి తీరతామని స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన గుంటూరులో ర్యాలీ జరుగుతుందన్నారు. ‘‘ప్రతిపక్ష పార్టీలకే పోలీసు నిబంధనలా...? వైసీపీ కార్యక్రమాలకు పోలీసు నిబంధనలు ఉండవా...?’’ అని ప్రశ్నించారు. ఎంత మందిని అరెస్టు చేసినా ర్యాలీ జరిపి తీరుతామని అన్నారు. చంద్రబాబు కోసం సామాన్య జనం రోడ్డు ఎక్కుతున్నారని తెలిపారు. ప్రజలను ఆపడం ఎవరి వల్ల కాదని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.


పోలీసులపై ప్రత్తిపాటి ఆగ్రహం...

శాంతి ర్యాలీకు పోలీసుల అడ్డంకులపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pulla rao) మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడమే పోలీసు పనిగా మారిందని విమర్శించారు. పోలీసులు జీతాలు తీసుకునేది జగన్ రెడ్డి సొమ్ము కాదని గుర్తించాలన్నారు. జగన్ రెడ్డి కోసం కాకుండా పోలీసులు ప్రజల కోసం పని చేయాలని హితవుపలికారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన గుంటూరు లో ర్యాలీ జరిగి తీరుతుందని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-07T11:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising