Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2023-08-30T10:17:50+05:30 IST

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో (Viajayawada Kanaka Durgamma Temple) పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సుప్రభాతం, స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు దుర్గగుడి అధికారులు అనుమతించించారు. సెప్టెంబరు1 న ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలో అన్ని ఆర్జిత‌ సేవలు రద్దు అయ్యాయి. అమ్మవారి నిత్య కైంకర్యాలను దేవస్థాన అర్చకులు నిర్వహించనున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-30T10:17:50+05:30 IST