ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రచ్చకెక్కిన విగ్రహాల వివాదం

ABN, First Publish Date - 2023-08-31T19:36:37+05:30

నందిగామ(Nandigama)లో మరొసారీ విగ్రహాల వివాదం రాజుకుంది. గురువారం నాడు నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం నేతలు(Telugu Desam Leaders), మున్సిపల్ అధికారుల మధ్య విగ్రహాలపై ఘర్షణ తలెత్తింది.

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ(Nandigama)లో మరొసారీ విగ్రహాల వివాదం రాజుకుంది. గురువారం నాడు నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం నేతలు(Telugu Desam Leaders), మున్సిపల్ అధికారుల మధ్య విగ్రహాలపై ఘర్షణ తలెత్తింది. ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ ఉందని టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. కమిటీ సభ్యులోని ఒకరికి అప్పగించామని మున్సిపల్ అధికారులు(Municipal Authorities) నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం వైసీపీ(YCP)లో ఉంటున్న వ్యక్తికి విగ్రహాన్ని ఎలా ఇస్తారని మున్సిపల్ అధికారులను టీడీపీ సభ్యులు నిలదీశారు. విగ్రహలకు తాము కాపాలా ఉండాలా అంటూ మున్సిపల్ అధికారులు విచిత్ర వాదన తెరమీదకు తీసుకొచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌ని నిలదీశారు. టీడీపీ సభ్యులకు గాని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Tangirala Soumya)కు చెప్పకుండా ఎలా ఇస్తారని నిలదీశారు. ఎవరికి ఇచ్చారో కాపీ ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఎవరకు బడితే వారికి ఎలా ఇస్తారని అడిగారు. రోడ్ల విస్తరణ పేరుతో ఇటీవల గాంధీ సెంటర్‌లో ఉన్న విగ్రహాలను మున్సిపల్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే.తొలగించిన విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు.

Updated Date - 2023-08-31T19:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising