ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Konakalla Narayana Rao: జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది

ABN, First Publish Date - 2023-09-12T22:47:36+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)కు ఓటమి భయం పట్టుకోవడంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేత కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao )వ్యాఖ్యానించారు.

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy)కు ఓటమి భయం పట్టుకోవడంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu)ను అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేత కొనకళ్ల నారాయణరావు (Konakalla Narayana Rao) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు పోరంకిలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో ఆ బాధతో ప్రాణాలు విడిచిన 23 మందికి సంతాపం తెలుపుతూ నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. జగన్ అసమర్థ, అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాం.చంద్రబాబు, లోకేష్‌ల సభలకు ప్రజలు తరలి వస్తున్నారు.ఇటువంటి వాటికి భయపడేది లేదు... పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి.పోలీసులు కూడా చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో నిరాహార దీక్షలు చేయాలి.న్యాయస్థానంలో న్యాయం గెలుస్తుంది.. చంద్రబాబు త్వరలో బయటకి వస్తారు.టీడీపీకి వస్తున్న ప్రజా ఆదరణను చూసి జగన్ పగ పెంచుకున్నాడు.జగన్ అరాచకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కొనకళ్ల నారాయణరావు తెలిపారు.

Updated Date - 2023-09-12T22:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising