AP News: వరి పొలంలో మొసలి.. వరి కోస్తుండగా..
ABN , First Publish Date - 2023-05-08T17:11:14+05:30 IST
జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురంలో వరి పొలంలో ముసలి కలకలం రేగింది.

కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురంలో వరి పొలంలో మొసలి కలకలం రేగింది. వరి కోస్తుండగా మిషన్ తగలి మొసలి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఫారెస్ట్ అధికారులు మొసలికి మత్తు మందు ఇచ్చి చికిత్స చేస్తున్నారు. అలాగే అదే జిల్లాలోని పత్తికొండ మండలం కనకదిన్నె శివారు ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జింకను బైక్ ఢీకొంది. బైక్పై వెళ్తున్న హుస్సేన్ షా (50) అనే వ్యక్తి మృతి. చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.