ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CID Notice: మరోసారి టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు...

ABN, First Publish Date - 2023-11-14T15:42:55+05:30

Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు.

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు (TDP Office) సీఐడీ నోటీసులు (CID Notice) జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో కోరింది. కాగా.. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీకి సంబంధించి విరాళాలను అడగడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టులో (AP High Court) టీడీపీ పిటిషన్‌ వేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో దశలో ఉండగానే సీఐడీ మరోసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై న్యాయనిపులతో సంప్రదించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై టీడీపీ నేతలు యోచినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-11-14T15:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising