Share News

RIMS : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో తోటి విద్యా్ర్థులపై గంజాయి బ్యాచ్ దాడి..

ABN , First Publish Date - 2023-11-21T13:02:06+05:30 IST

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్లాసు రూములోనే తోటి విద్యార్థులపై గంజాయి బ్యాచ్ ఒకటి దాడులకు పాల్పడింది.గంజాయి సేవిస్తున్నారన్న ఫిర్యాదుతో నాలుగు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ బయటకు పంపించడం జరిగింది.

RIMS : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో తోటి విద్యా్ర్థులపై గంజాయి బ్యాచ్ దాడి..

ప్రకాశం : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్లాసు రూములోనే తోటి విద్యార్థులపై గంజాయి బ్యాచ్ ఒకటి దాడులకు పాల్పడింది.గంజాయి సేవిస్తున్నారన్న ఫిర్యాదుతో నాలుగు నెలల క్రితం ఆరుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి ప్రిన్సిపల్ బయటకు పంపించడం జరిగింది. తాజాగా సదరు విద్యార్థులు హాస్టల్‌కు తిరిగి వచ్చారు. తమపై ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేశారని క్లాస్ రూములోనే గంజాయ్ బ్యాచ్ కొందరు విద్యార్థులపై పిడిగుద్దులు కురిపించింది. ఈ ఘటనలో యశ్వంత్ అనే విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ప్రిన్సిపల్ ఏడుకొండలు ఈ ఘటనపై విద్యార్థులను విచారిస్తున్నారు.

Updated Date - 2023-11-21T13:02:07+05:30 IST