Chandrababu: చంద్రబాబు సభలో తాళాలు పగలగొట్టి మరీ..

ABN, First Publish Date - 2023-02-17T19:50:13+05:30

అనపర్తి దేవీచౌక్‌లో చంద్రబాబు సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో అనపర్తిలో భారీగా పోలీసులు మోహరించారు.

Chandrababu: చంద్రబాబు సభలో తాళాలు పగలగొట్టి మరీ..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) పర్యటన కొనసాగుతోంది. అనపర్తి దేవీచౌక్‌లో చంద్రబాబు సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో అనపర్తిలో భారీగా పోలీసులు మోహరించారు. దేవీచౌక్‌లో జనరేటర్‌ల ద్వారా లైట్లను ఏర్పాటు చేసినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనరేటర్‌లకు తాళాలు వేసి ఆపరేటర్‌లను పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళాలు పగలగొట్టి జనరేటర్‌లను టీడీపీ కార్యకర్తలు ఆన్ చేయించారు. జనరేటర్లను ఆపేందుకు పోలీసుల ప్రయత్నించడంతో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులతో టీడీపీ కార్యకర్తల వాగ్వాదానికి దిగారు.

అంతకు ముందుకు బలభద్రపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్‌ని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు, పారా మిలిటరీ బలగాలను ప్రభుత్వం మోహరించింది. రోడ్డుకు అడ్డంగా పోలీసులు (police) కూర్చున్నారు. అయితే చంద్రబాబు కారు దిగి కాలినడకన అనపర్తి బయలుదేరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుపై లారీలు, బస్సులు, వ్యాన్లను రోడ్డుపై నిలిపివేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఉన్న వాహనాలు తీస్తారా లేదా అని చంద్రబాబు పోలీసులకు అల్టిమేటం (Ultimatum) జారీ చేశారు. అయినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. ఈ పరిణామాలను చూసిన ఆయన ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యారు.

ఇది పోలీసుల రాజ్యం కూడా కాదు రౌడీరాజ్యమన్నారు. సహాయ నిరాకరణ చేస్తోన్న ప్రతి పోలీసునూ గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. జగన్‌రెడ్డి (Jagan Reddy) ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వ అంతానికి ఇది ప్రజాతిరుగుబాటని హెచ్చరించారు. ఈ సైకో జగన్‌రెడ్డిని ఎవరూ కాపాడలేరన్నారు. పోలీసులు దారి ఇవ్వకపోతే ముందుకే దూసుకెళ్తామని ప్రకటించారు. ఎంతమందిపై కేసులు పెడతారో చూస్తామని, తమ కార్యకర్తలు ముందుకొస్తే పోలీస్‌ స్టేషన్లే పట్టవని చెప్పారు. రౌడీరాజ్యం అంతం చేసేందుకు ఇదే కౌంట్‌డౌన్‌ అని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు.

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అనపర్తిలో నిర్వహించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని టీడీపీ (TDP) కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అనపర్తి (Anaparthi)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు సభపై పోలీసుల ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. రోడ్డుపై సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే ప్రాంతంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించుకోవాలని డీఎస్పీ భక్తవత్సల సూచించారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని, టీడీపీ నేతలు సహకరించాలని కోరారు డీఎస్పీ. పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

***********************************

మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిలారెడ్డి ఫైర్‌.. ఒళ్లు దగ్గర పెట్టుకుని..

*************************

ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తోందా?

**********************************

Updated Date - 2023-02-17T20:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising