Share News

Kaikaluru MLA: ఏలూరు అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2023-10-20T15:58:21+05:30 IST

ఏలూరులో అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kaikaluru MLA: ఏలూరు అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే ఆగ్రహం

ఏలూరు: ఏలూరులో అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో ఎంపీ శ్రీధర్ అధ్యక్షతన పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో శివారు భూములకు సాగునీరు అందడం లేదంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి పలుమార్లు చూపించినా పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం చేశారు. దీంతో ఎంపీ శ్రీధర్‌, జాయింట్ కలెక్టర్‌లు కలిసి ఎమ్మెల్యేకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించలేకపోతే.. నేనేందుకు.. అవసరమైతే రాజీనామా చేసి రైతుల కోసం పోరాడుతా’’ అంటూ హెచ్చరించారు. కృష్ణా డెల్టా ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.

Updated Date - 2023-10-20T15:58:21+05:30 IST