Mamata Banerjee: నిన్న రాకేష్..నేడు ఇందిర..! తడబడిన దీదీ..

ABN , First Publish Date - 2023-08-29T20:03:21+05:30 IST

అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పేరును పొరపాటున బాలీవుడ్ నటుడు రాకేష్ రోషన్ అంటూ గత వారం మాట్లాడిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తడబడ్డారు. ఈసారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చంద్రుడు దగ్గరకు వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెటిజెన్ల విమర్శలకు గురయ్యారు.

Mamata Banerjee: నిన్న రాకేష్..నేడు ఇందిర..! తడబడిన దీదీ..

న్యూఢిల్లీ: అంతరిక్షం (Space) లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ (Rakesh Sharma) పేరును పొరపాటున బాలీవుడ్ నటుడు రాకేష్ రోషన్ (Rakesh Roshan) అంటూ గత వారం మాట్లాడిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి తడబడ్డారు. ఈసారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) చంద్రుడు దగ్గరకు వెళ్లారంటూ వ్యాఖ్యానించి నెటిజెన్ల విమర్శలకు గురయ్యారు.


తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ చంద్రుడి పైకి వెళ్లినప్పుడు రాకేష్ (శర్మ)ను అక్కడి నుంచి హిందుస్థాన్ ఎలా ఉందని అడిగారని, ప్రపంచంలోనే ఉత్తమంగా ఉందని ఆయన బదులిచ్చారని చెప్పారు. రాకేష్ శర్మ వాస్తవానికి అంతరిక్షంలోకి వెళ్లగా, మమత మాత్రం చంద్రుడి పైకి అంటూ ప్రస్తావించారు. ఇందిరాగాంధీ చంద్రుడి దగ్గరకు వెళ్లినప్పుడు...అంటూ మాట్లాడారు. దీంతో మమత నెట్టింట ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇందిరాగాంధీ చంద్రుడి దగ్గరకు వెళ్లిన విలువైన సమాచారం ఇస్రోకు తెలుసా అంటూ ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-08-29T20:28:27+05:30 IST