ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhi: జైలు నుంచి విడుదల అనంతరం షాకింగ్ నిజాలు బయట పెట్టిన పట్టాభి

ABN, First Publish Date - 2023-03-04T20:41:56+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ (TDP leader Kommareddy Pattabhi Ram) సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ (TDP leader Kommareddy Pattabhi Ram) సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నాయకుడిగా అండగా నిలబడడం కోసం తాము గన్నవరం వెళ్తే.. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఎసీ, ఎస్టీ, బీసీలపై అతికిరాతకంగా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు చెందిన పార్టీ అని పట్టాభి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలపై దాడులు జరిగినా, అన్యాయం జరిగినా తాము వెళ్తామని చెప్పారు.

తన వాహనం నుంచి తనను పోలీసు వాహనంలోకి ఎక్కించి ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి 2 గంటల వరకు 200 కిలోమీటర్లు తిప్పారని పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉన్న ఇద్దరు ఎస్ఐలకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి జిల్లా ఎస్పీ ఫోన్ చేస్తారని పట్టాభి చెప్పారు. తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి ప్రతినిత్యం ఎస్పీ డైరెక్షన్‌లో ఈ వ్యవహారమంతా నడిచిందని ఆయన మండిపడ్డారు. చివరి అర్థరాత్రి 2 గంటలకు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. ఊరంతా విద్యుత్ కాంతులతో లైట్లు వెలుగుతుంటే.. పోలీస్ స్టేషన్‌లో మాత్రం కరెంట్ లేదని, పూర్తిగా చీకటిగా ఉందని చెప్పారు. తనతోపాటు వచ్చిన ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్ స్టేషన్ కరెంట్ ఎందుకు లేదని అడిగానని, ఏదో పవన్ ఫెయిల్యూర్ అయి ఉంటుందని, కరెంట్ వస్తుందలే అంటూ తనను లోపలికి తీసుకెళ్లారని, లోపల ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరని, మొత్తం స్టేషన్ నిర్మానుష్యంగా ఉందని చెప్పారు. స్టేషన్‌లో తనను ఒక్కరినే కూర్చొపెట్టి పోలీసులు మళ్లీ వస్తామని చెప్పి బయటకువెళ్లారని ఆరోపించారు.

పోలీసులు వెళ్లిపోయిన 15 నిమిషాలకు ముగ్గురు ముసుగులు వెసుకొని బందీపోటు దొంగలు వచ్చినట్లు వచ్చి తన మొహానికి టవల్ చూట్టి ఊపిరి ఆడకుండా చేశారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఒక గదిలోకి ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారని పట్టాభి చెప్పారు. దాదాపు 35 నిమిషాలపాటు తనను చిత్రహింసలకు గురిచేశారని పట్టాభి పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తనను అక్కడ వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మొహానికి ఉన్న టవల్ తీసి చూసేసరికి అప్పటికీ స్టేషన్ ఎవరూ లేరని చెప్పారు. తాను అతికష్టం మీద లేచి ఓ కూర్చిలో కూర్చున్న 5 నిమిషాలకు తనను స్టేషన్‌లో దింపి వెళ్లిన ఎస్ఐలు తిరిగి వచ్చారని చెప్పారు. ఎస్పీ ప్లాన్ పక్కాగా అమలు చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు.

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్(TDP leader Kommareddy Pattabhi Ram)‎కు కోర్టులో ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) నుంచి పట్టాభి విడుదలయ్యారు. పట్టాభికి జిల్లా కోర్టు (court)బెయిల్ మంజూర్ చేసింది. రూ.25వేల చోప్పున పూచీకత్తు ఇవ్వాలనీ కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టాభికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పట్టాభితోపాటు తెలుగుదేశం నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-03-04T21:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising