ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ICC Tournaments: నాకౌట్ మ్యాచ్‌లలో రోహిత్ ప్రదర్శన ఇంత దారుణమా?

ABN, First Publish Date - 2023-11-14T15:49:34+05:30

2007 నుంచి పలు ఐసీసీ టోర్నీలలో రోహిత్ టీమిండియా తరఫున ఆడాడు. అయితే నాకౌట్లలో రోహిత్ ప్రదర్శన చెత్తగా ఉంది. ఇప్పటి వరకు కేవలం అతడు రెండు సార్లు మాత్రమే 50 ప్లస్ స్కోరు చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీస్‌లో రోహిత్ ఎలా ఆడతాడో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో 2011 నుంచి టీమిండియా వరుసగా నాలుగు సార్లు నాకౌట్లకు చేరింది. 2011లో విశ్వవిజేతగా నిలవగా.. 2015, 2019 ప్రపంచకప్‌లలో సెమీస్‌లో ఓటమి పాలైంది. తాజాగా 2023 ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి సెమీస్ చేరింది. అయితే సెమీస్‌లో మన స్టార్ ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ప్రపంచకప్ చూసుకుంటే రోహిత్, విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో కనిపిస్తున్నారు. రోహిత్ ధాటిగా ఆడుతుంటే.. కోహ్లీ మాత్రం కూల్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కోహ్లీ ప్రదర్శన ఫర్వాలేదనే చెప్పాలి. అతడు ఇప్పటివరకు ఐసీసీ నాకౌట్లలో ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ రోహిత్ మాత్రం కేవలం రెండు సార్లు మాత్రమే 50 ప్లస్ స్కోరు చేశాడు.

2007 నుంచి పలు ఐసీసీ టోర్నీలలో రోహిత్ టీమిండియా తరఫున ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 8 నాటౌట్ స్కోరు చేయగా.. ఫైనల్లో పాకిస్థాన్‌పై 30 నాటౌట్ స్కోరు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌కు చోటు దక్కలేదు. 2013 ఐసీసీ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో శ్రీలంకపై కేవలం 33 పరుగులే చేశాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌పై 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. 2014 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై రోహిత్ 24 పరుగులు మాత్రమే చేశాడు. ఫైనల్లో శ్రీలంకపై 29 పరుగులకు అవుటయ్యాడు. 2015లో జరిగిన వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై రోహిత్ సెంచరీతో రెచ్చిపోయాడు. దీంతో 137 పరుగులు చేశాడు. అయితే సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 34 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.


ఇక 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు. 2017లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో మరోసారి బంగ్లాదేశ్‌పై తన ప్రతాపం చూపించాడు. 123 నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఫైనల్‌లో పాకిస్థాన్‌పై డకౌట్ అయ్యాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. 2021లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేశాడు. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 27 పరుగులకు రోహిత్ అవుట్ అయ్యాడు. 2023లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. మొత్తంగా ఐసీసీ టోర్నీల్లో జరిగిన నాకౌట్లలో బంగ్లాదేశ్‌పై రెండు సెంచరీలు మినహాయిస్తే రోహిత్ మిగతా జట్లపై ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీస్‌లో రోహిత్ ఎలా ఆడతాడో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Updated Date - 2023-11-14T16:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising