ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: తొలి టెస్టులో రవీంద్ర జడేజా ఎందుకు ఆడడం లేదు?.. రోహిత్ శర్మ చెప్పిన సమాధానం ఇదే!..

ABN, Publish Date - Dec 27 , 2023 | 07:44 AM

ఆసక్తి రేపిన భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.

సెంచూరియన్: ఆసక్తి రేపిన భారత్, సౌతాఫ్రికా టెస్టు సిరీస్ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. సాధారణంగా టీమిండియా ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగినప్పుడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, బౌలర్ అయినా జడేజా కీలక సమయాల్లో వికెట్లు తీయడంతోపాటు మిడిలార్డర్‌లో విలువైన పరుగులు చేస్తుంటాడు. దీంతో తుది జట్టులో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు అవకాశం దక్కుతుంటుంది. కానీ సౌతాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఆశ్చర్యకరంగా రవీంద్ర జడేజాకు తుది జట్టులో స్థానం దక్కలేదు. అతని స్థానంలో మరో సీనియర్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.


ఇందుకు గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ సమయంలోనే చెప్పాడు. మంగళవారం ఉదయం నుంచి రవీంద్ర జడేజా వెన్ను నొప్పితో బాధపడుతున్నాని రోహిత్ తెలిపాడు. అందుకే ఈ టెస్ట్ మ్యాచ్‌లో జడ్డూ ఆడడం లేదని, అతని స్థానంలో అశ్విన్‌ను ఆడిస్తున్నట్టు చెప్పాడు. కీలక టెస్టు సిరీస్‌కు ముందు సడంగా వెన్నునొప్పితో జడేజా జట్టుకు దూరం కావడం టీమిండియాను కలవరపరుస్తోంది. దీంతో జడేజా వీలైనంత త్వరగా కోలుకుని రెండో టెస్టు మ్యాచ్‌ నాటికి జట్టుకు అందుబాటులో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 67 టెస్టు మ్యాచ్‌లాడిన జడేజా బ్యాటర్‌గా 36 సగటుతో 2804 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలర్‌గా 275 వికెట్లు తీశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగారు. ముఖ్యంగా కగిసో రబాడ (5/44) విజృంభణకు భారత బ్యాటర్లు దాసోహమయ్యారు. అతడి బౌన్స్‌, స్వింగ్‌ బంతులకు రోహిత్‌ (5), శ్రేయాస్‌ (31), విరాట్‌ కోహ్లీ (38), అశ్విన్‌ (8), శార్దూల్‌ (24) పెవిలియన్‌ చేరడం భారత్‌ను దెబ్బతీసింది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు ఆడిన కేఎల్‌ రాహుల్‌ (105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 బ్యాటింగ్‌) మాత్రం తన కళాత్మక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలిచాడు. అతడి పోరాటం కారణంగా తొలి రోజు మంగళవారం భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. అయితే ఆఖరి సెషన్‌ ఆరంభమైన కాసేపటికే వర్షం కురవడంతో ఆటను రద్దు చేశారు. తొలి రోజు 31 ఓవర్ల ఆట కోల్పోయినందున బుధవారం మధ్యాహ్నం అరగంట ముందుగా... ఒంటి గంటకే మ్యాచ్‌ ఆరంభమవుతుంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌తో పాటు సిరాజ్‌ (0) ఉన్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అరంగేట్రం చేశాడు.

Updated Date - Dec 27 , 2023 | 07:44 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising