ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lakshman: పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారు

ABN, First Publish Date - 2023-11-22T23:02:00+05:30

విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

హైదరాబాద్: విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు. బుధవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఓవైసీ సోదరులు నిసుగ్గుగ్గా మాట్లాడుతున్నారు. దారుసలాం నుంచి అనుమతి పొందితే తప్ప పాతబస్తీలో తిరిగే పరిస్థితి లేదు. ఎవరు పాతబస్తీకి వెళ్లిన భౌతిక దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పాత బస్తీ లేదా.. చట్టాలు వారికి వర్తించవా. కాంగ్రెస్, బీజేపీ మజ్లిస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఓవైసీపైన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి’’ అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-22T23:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising