Home » MIM
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ, ఎంఐఎం ముఖాముఖీ పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నిక కోసం నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా, ఇద్దరి నామినేషన్లు మాత్రమే చెల్లుబాటవుతాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి సోమవారం తెలిపారు.
Kishan Reddy On MIM: హైదరాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీలు తమతమ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించాయి. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎన్. గౌతమ్రావు తన నామినేషన్ను దాఖలు చేశారు. అలాగే.. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి తన నామినేషన్ను దాఖలు చేశారు.
Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.
GHMC: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవమైంది. సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్) పార్టీ నిర్ణయించింది. ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు అధికంగా ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను పోటీకి దించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రణాళికుల రూపొందించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలోదకాలు ఇచ్చేశారని బీజేపీ ఎంపీ ధర్మపూరి అర్వింద్ మండిపడ్డారు. ఏ హామీ అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలోకి రేవంత్ రెడ్డి సర్కార్ ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పాదయాత్ర చేపడతానని ప్రకటించడంపై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఇది పాదయాత్రా లేకుంటే పదవుల యాత్రో స్పష్టం చేయాలని కేటీఆర్ను అర్వింద్ డిమాండ్ చేశారు.
నాంపల్లి ఎమ్మెల్మే మాజిద్ హుస్సేన్(Nampally MLM Majid Hussain), కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ఖాన్(Congress leader Feroze Khan) మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వారి అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
బండ్లగూడ మండలం సలకం చెరువును ఒవైసీ బ్రదర్స్ ఆక్రమించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ చోట ఫాతిమా మహిళా కాలేజీ నిర్మించారని చెబుతోంది. గూగుల్ మ్యాప్ ఫొటోలతో ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది. 2012లో వ్యవసాయ భూమి ఉండేదని.. 2024లో హఠాత్తుగా ఫాతిమా ఒవేసీ కాలేజీ ఏర్పడిందని వివరించింది.