ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections: కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి టీడీపీ పూర్తి మద్దతు

ABN, First Publish Date - 2023-11-21T16:24:07+05:30

Telangana Elections: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయా రెడ్డికి టీడీపీ పూర్తి సంఘీభావం తెలిపింది.

హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయా రెడ్డికి (Congress Candidate Vijayareddy) టీడీపీ (TDP) పూర్తి సంఘీభావం తెలిపింది. మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతలతో కలసి విజయారెడ్డి స్వర్గీయ ఎన్టీరామారావుకు నివాళులు అర్పించారు. నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు, గత మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేసిన నాయకులు బాలాజీ గోస్వామి, పి.వంశీకృష్ణ, నల్లెల కిషోర్, ప్రవీణ్, నరసింహ, శ్రీనివాస్ నాయీ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా కాంగ్రెస్‌కు, దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌రెడ్డి కుమార్తె విజయారెడ్డి గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించారు. విజయా రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తామని అనంతరం ఎన్టీఆర్, పీజేఆర్లలా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని బాలాజీ గోస్వామి కోరారు.


విజయారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వర్గాల మద్దతు తమకెంతో కీలకమని, ఎన్టీఆర్, పీజేఆర్‌లు ప్రజల కోసం శ్రమించారని, వారి అడుగుజాడల్లో నడుస్తున్న తనకు టీడీపీ శ్రేణుల మద్దతు ఎంతో ఉపకరిస్తుందన్నారు. అందరిని కలుపుకుపోతూ టీడీపీ నాయకుల సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్తామని, ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ధ్యేయంగా పని చేస్తామని విజయారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-21T16:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising