ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP MP: కళ్లుండి చూడలేని కబోదులు.. మంత్రి కేటీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్

ABN, First Publish Date - 2023-04-04T12:54:59+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్‌ చేసిన విమర్శలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై మంత్రి కేటీఆర్‌ (Minister KTR) చేసిన విమర్శలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) తీవ్రంగా ఖండించారు. మోదీ చేస్తోన్న అభివృద్దిని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) కళ్ళుండి చూడలేని కబోదులని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ... ఉద్యోగాల పేరుతో లక్షల మంది యువతను మోసం చేసిన ఘనత కేసీఆర్ (Telangana CM KCR) ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రధానమంత్రి మోదీకి ఎదురుపడటానికి బీఆర్ఎస్ నేతలకు ముఖం చెల్లటంలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సహకరించకపోవటం‌ వలనే కేంద్ర ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వేశాఖ తెలంగాణకు భారీగా నిధులు కేటాయించిందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం‌ మోదీ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వందే భారత్ రైలు (Vande Bharath Train) కోసం వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాలకు రెండో వందే భారత్ రైలును ఇచ్చినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయన్నారు. ఈనెల 8న రాష్ట్రానికి సంబంధించిన హైవేలకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-04T12:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising