కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Renuka Chowdhury: ప్రవళిక క్యారెక్టర్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం

ABN, First Publish Date - 2023-10-14T14:47:04+05:30

చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి ప్రవళిక క్యారెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి( Renuka Chowdhury) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Renuka Chowdhury: ప్రవళిక క్యారెక్టర్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం

హైదరాబాద్: చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి ప్రవళిక క్యారెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి( Renuka Chowdhury) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవళిక క్యారెక్టర్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై రేణుక చౌదరి మండిపడ్డారు. ప్రవళిక క్యారెక్టర్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఏసీపీ యాదగిరిని తీవ్రంగా హెచ్చరించారు. శనివారం నాడు రేణుకాచౌదరి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ. ప్రవళిక మృతి పట్ల చెత్తగా మాట్లాడిన పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థి క్యారెక్టర్‌పై పోలీసులు దుష్ప్రచారం చేస్తున్నారు. సీతమ్మ నుంచి ఇప్పటిదాక అమ్మాయిలకు శీల పరీక్ష తప్పడం లేదు. ఏసీపీ క్షమాపణ చెప్పకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తా అని హెచ్చరించారు. సూసైడ్ లెటర్‌లో గ్రూపు 2 రద్దుతోనే చనిపోయిందని రాసిన అమ్మాయిపై అభాండాలు వేస్తున్నారు’’ అని రేణుకా చౌదరి మండిపడ్డారు.

Updated Date - 2023-10-14T14:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising