ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Podem Veeraya: కేటీఆర్.. ఏ మొహం పెట్టుకోని భద్రాచలం వస్తున్నావ్..?

ABN, First Publish Date - 2023-09-29T19:15:49+05:30

జిల్లాకు ఏ మొహం పెట్టుకోని రేపు మంత్రి కేటీఆర్(KTR) భద్రాచలం వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య (Podem Veeraya) ఎద్దేవ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాకు ఏ మొహం పెట్టుకోని రేపు మంత్రి కేటీఆర్(KTR) భద్రాచలం వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య (Podem Veeraya) ఎద్దేవ చేశారు. శుక్రవారం నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎలక్షన్‌లో ప్రజల ఓట్లను దండుకోవాలని రేపు కేటీఆర్(KTR) భద్రాచలం వస్తున్నారు. భద్రాచలంకి 100 కోట్లు ఇస్తానని, వరదల సమయంలో వచ్చినపుడు 1000 కోట్లు ఇస్తా అన్నారు ఏమైంది ఆ వాగ్దానం..? 2014 నుంచి ఇప్పటి వరకు భద్రాచలం రాముల వారికి తలంబ్రాలు ఒక్కసారి తెచ్చారు. ఆ తర్వాత ఒక్క సారీ కూడా రాలేదని ఇప్పుడెందుకు భద్రాచలం వస్తున్నారు. ఇన్ని రోజులు నిద్ర పోయారు ఇక్కడ ఉన్నటువంటి BRS నాయకులకు కూడా సిగ్గు ఉండాలి. ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, తాలిపేరు మరమ్మతులకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు. రేపు కేటీఆర్(KTR) పర్యటన కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే. ఇకనైనా రాకపోతే బీఆర్ఎస్(BRS)ను భద్రాచలంలో మరచి పోతారని వస్తున్నాడు’’ అని పోదెం వీరయ్య మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-29T19:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising