ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gutha Sukhenderreddy: కోమటిరెడ్డి సన్యాసం తీసుకో.. ఇదే సరైన సమయం.. గుత్తా సెటైర్

ABN, First Publish Date - 2023-08-17T11:36:11+05:30

‘‘పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నా సహకారం ఉంటుంది.. మాకు కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వమే’’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

నల్గొండ: ‘‘పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నా సహకారం ఉంటుంది.. మాకు కావాల్సింది కేసీఆర్ ప్రభుత్వమే’’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) స్పష్టం చేశారు. గురువారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Congress MP Komatireddy Venkatreddy) సమయం, సందర్భం లేకుండా తనపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. టెండర్ల ద్వారానే గంధమల్ల రిజర్వాయర్ పనులు వచ్చాయని, భూసేకరణ వల్ల పనుల్లో ఆలస్యం ఏర్పడిందన్నారు. నిజాంకాలం నాటి నుండే ఉన్న కాంట్రాక్టర్లను గుత్తా సుఖేందర్ రెడ్డికి అపాదించడం సరికాదన్నారు. ఏ పదవీ వద్దంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్యాసం తీసుకుంటే మంచిది, ఇదే సరైన సమయం అంటూ ఎద్దేవా చేశారు. రెండు లక్షల రుణమాఫీ అసాధ్యంమైందే ప్రజలు అలోచించాలన్నారు. ప్రజలను మోసం చేసేలా జాతీయ పార్టీలు వ్యవహరించొద్దని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడు ఒకటంటే మరొకరు ఒకటంటారని... వీరు అధికారంలోకి ఎలా వస్తారని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-08-17T11:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising