ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SINDHURA చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

ABN, Publish Date - Sep 23 , 2024 | 11:47 PM

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చే సుకున్న సందర్భంగా మండలంలోని పాముదుర్తి పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి పాల్గొన్నారు.

MLA and ex-minister Palle doing Bhumi Puja for road works

బుక్కపట్నం, సెప్టెంబరు 23: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చే సుకున్న సందర్భంగా మండలంలోని పాముదుర్తి పంచాయతీలో సోమవారం ఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రజాసంక్షేమ పాలనసాగుతోంది. గత ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందన్నారు. చంద్రబాబునాయుడు నాయత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తూ ముందుకెళుతోందన్నారు. నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువు, మరాల రిజర్వాయర్లకు త్వరలో హంద్రీనీవా నీరు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటామన్నారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పౌష్టికాహారం గర్భిణులకు అందించాలని అక్కడే ఉన్న అదికారులకు సూచించారు. గర్భిణులకు పసుపుకుంకుమ ఇచ్చి సీమంతం చేశారు. గ్రామంలో సీసీరోడ్లకు భూమి పూజ చేశారు. ఎంఈఓ గోపాల్‌నాయక్‌, ఏఓ సతీ్‌షబాబు, అన్నిశాఖల అధికారులు, టీడీపీ మండలకన్వీనర్‌ చింతా మల్లిరెడ్డి, గంగాధర్‌, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:47 PM