Share News

PLANTS : విష సంస్కృతిని విడనాడాలి: గుండుమల

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:37 AM

మండలంలోని బంద్రేపల్లిలో కృష్ణప్ప అనే రైతుకు చెందిన వక్క మొక్కలను అగంతకులు పెరికి వేశారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పారు. గ్రామాల్లో ఇలాంటి విష సంస్కృతిని విడనాడాలని సోదరభావంతో మెలగాలని ఆయన పేర్కొన్నారు.

PLANTS : విష సంస్కృతిని విడనాడాలి: గుండుమల
The victims showing the vakka plants that the assailants had planted

రొళ్ల, జూన 20: మండలంలోని బంద్రేపల్లిలో కృష్ణప్ప అనే రైతుకు చెందిన వక్క మొక్కలను అగంతకులు పెరికి వేశారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పారు. గ్రామాల్లో ఇలాంటి విష సంస్కృతిని విడనాడాలని సోదరభావంతో మెలగాలని ఆయన పేర్కొన్నారు. తాను నాటిన 400 మొక్కలలో దాదాపు 100 మొక్కలను గుర్తుతెలియని వ్యక్తులు పెరికి వేయడంతో దాదాపు రూ.20వేలు నష్టం వాటిల్లిం దని బాధిత రైతు వాపోయాడు. ఈసందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు దాసిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి, మండల కార్యదర్శి ఈరన్న, తెలుగుయువత నాయకుడు బాలకృష్ణ, భరత, మాజీ ఎంపీపీ సిద్దగంగప్ప, పాండురంగప్ప, రామచంద్రప్ప, తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 21 , 2024 | 12:37 AM