ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Peddireddy: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి మనవడి హంగామా..

ABN, Publish Date - Mar 11 , 2024 | 09:31 AM

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి మనవడు సందడి సృష్టించాడు. తానే మంత్రినన్నట్టుగా వ్యవహరించాడు. పెద్దిరెడ్డి తో పాటు మనవుడు(ఎంపీ మిధున్ రెడ్డి ) కొడుకు జస్విన్ రెడ్డి తాతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

చిత్తూరు: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) మనవడు హంగామా సృష్టించాడు. తానే మంత్రినన్నట్టుగా వ్యవహరించాడు. పెద్దిరెడ్డి తో పాటు మనవుడు(ఎంపీ మిధున్ రెడ్డి (MP Mithunreddy) ) కొడుకు జస్విన్ రెడ్డి తాతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో హల్‌చల్ చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా రెండు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తాతతో పాటు ఎడాపెడా రిబ్బన్లు కత్తిరిస్తూ, ప్రారంభోత్సవాలు చేస్తూ, మొక్కలు నాటుతూ హంగామా చేస్తున్నాడు.

YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?

ఏకంగా వేదిక మీదనే జస్విన్ రెడ్డికి సైతం మంత్రికి జరిగినట్టుగా మర్యాదలు జరుగుతున్నాయి. కుర్చీ వేసి కూర్చోబెట్టి మరీ గౌరవిస్తున్నారు. ఎక్కడికక్కడ అధికారులు పెద్దిరెడ్డితో సమానంగా మనవడిని గౌరవిస్తూ పుష్పుగుచ్చాలిచ్చి స్వాగతం పలుకుతున్నారు. నాలుగు రోజుల క్రితం చిత్తూరు నియోజకవర్గంలో.. నిన్నటి రోజున గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో జరిగిన అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని మనవడు హంగామా సృష్టించాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మనవడు హంగామాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

YS Sharmila: ‘సిద్ధం’ ప్రచారానికి 600 కోట్లు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 09:39 AM

Advertising
Advertising