ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP Leader: బోరుగడ్డ బ్యాంక్ ఖాతాల్లో కోట్ల కొద్దీ డబ్బు..

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:06 AM

గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్‌ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్‌లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది.

అమరావతి: గత వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా .. ఉన్మాదిలా సోషల్ మీడియా (Social Media) వేదికగా వికృతంగా వ్యవహరించిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) అరాచకాల గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉన్నత స్థాయిలో బోరుగడ్డ కేసుపై పోలీస్ అధికారులు దృష్టి సారించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఎంతవరకు పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.


గతంలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఈఎల్సీ చర్చి వివాదంలో తలదూర్చి చర్చి ట్రెజరర్ కర్లపూడి బాబూ ప్రకాష్‌ రూ. 50 లక్షలు ఇవ్వాలని అనిల్ కుమార్ ఫోన్‌లో బెదిరించాడు. వీడియో క్లిప్పింగ్స్ పంపి బ్లాక్ మెయిల్ కూడా చేశాడు. దీనిపై బోరుగడ్డతోపాటు ఆయన అనుచరుడైన పండ్ల వ్యాపారి హరిపై అరండల్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఈనెల 17న అమరావతిలో అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫారెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో అనిల్ ఎవరిరెవరిని తిడుతూ పోస్టులు పెట్టి.. బెదిరింపులకు పాల్పడిన వాటిపై విచారణ చేస్తున్నారు. మరోవైపు అనిల్ కుమార్ బ్యాంక్ అకౌంట్లో కోట్లాది రూపాయల డబ్బులున్నాయి. తాడేపల్లి పెద్దల నుంచి అతినికి డబ్బులు వచ్చాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయా బ్యాంకుల ఖాతాలను పోలీసులు పరిశీలించనున్నారు. ప్రతిపక్ష నేతలపై పోస్టులు పెడుతూ.. తిడుతుండడంతో తాడేపల్లి పెద్దలు నెల నెలా కోట్లాది రూపాయలు పంపించారనే ప్రచారం జరుగుతోంది


కాగా వైసీపీ నాయకులు రెచ్చగొట్టి, ప్రతిపక్షాలను తిట్టాలని ఆదేశించడం వల్లే ఆనాడు దూషించాల్సి వచ్చిందని పోలీస్‌ అధికారుల వద్ద రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ మొరపెట్టుకున్నట్లు సమాచారం. ‘నీవు దళితుడివి...నీకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుంది.. టీడీపీని తిడితే మేం అండగా ఉంటాం...’ అని నాడు ప్రోత్సహించిన వారు.. నేడు ఒక్కడు కూడా పరామర్శకు రాలేదని వాపోయినట్టు సమాచారం. ‘‘ఆ రోజు అలా తిట్టడం తప్పే.. ఎవరినైతే సోషల్‌ మీడియాలో తిట్టానో వారందరి కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరుతాను. అప్రూవర్‌గా మారతాను’’ అని వేడుకొన్నట్టు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతల నుంచి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళల వరకు.. అందరినీ అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏఈఎల్‌సీ చర్చి వివాదం కేసులో అనిల్‌ను గురువారం పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరచగా, 29 వరకు రిమాండ్‌ విధించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని మేజిరేస్టట్‌ ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న పోలీసుల వద్ద అనిల్‌ కన్నీరు మున్నీరైనట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసు అధికారులు ఏది అడిగినా అనిల్‌ దాచుకోకుండా సమాధానమిచ్చారు. ‘‘నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. దానికితోడు వైసీపీ నాయకులు.. నన్ను ముందుకు నెట్టి తాము వెనుక ఉన్నారు. నాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన సోదరుడితో పాటు గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడు అప్పిరెడ్డి ఆదేశానుసారమే నాటి విపక్ష నేతలను దూషించాను. బెదిరింపులకు పాల్పడ్డాను’’ అని తెలిపారు. ఇన్నాళ్లు ఢిల్లీలో కేంద్రమంత్రి రాందాస్‌ అథావాలే వద్ద ఉన్నానని, తన తల్లికి సర్జరీ చేయించడం కోసం గుంటూరుకు వచ్చానని అనిల్‌ పేర్కొన్నారు.


ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అనిల్‌పై చర్యలు

రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ‘‘అనిల్‌ కుమార్‌ తనకు తాను రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొంటున్నాడు. దీనిపై అనేక వివాదాలు ఉన్నాయి. వర్డ్‌ అకాడమీ(యూకే) పేరుతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. 2018లో అనంతపురం టౌన్‌లో ఐఏఎస్‌ అధికారినని చెప్పి మోసం చేసిన కేసులో అనిల్‌ జైలు కెళ్లాడు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అనిల్‌ రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై సోషల్‌ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించేవాడు. ఆయనపై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అనిల్‌ను పోలీస్‌ కస్టడీ తీసుకొని పూర్తిస్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆయన వెనుక అదృశ్య శక్తులు ఎవరనైనా ఉన్నారా గుర్తించాల్సిఉంది’’ అని ఎస్పీ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ తీరును తప్పుపడుతున్న నాయకులు

పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో

షర్మిలతో రాయ‘బేరం’

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 21 , 2024 | 09:17 AM