YCP: గుంటూరులో వైసీపీకి మరో షాక్..
ABN, Publish Date - Feb 17 , 2024 | 11:58 AM
గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాడిశెట్టి సోదరులు పార్టీని వీడుతున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు, నగర డిప్యూటీ మేయర్గా తాడిశెట్టి మురళీ పని చేశారు. వీరిద్దరూ వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. ఈ నెల 19న తాడికొండ సోదరుల ఆత్మీయ సమావేశం జరగనుంది.
గుంటూరు: గుంటూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాడిశెట్టి సోదరులు పార్టీని వీడుతున్నారు. గతంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా తాడిశెట్టి వెంకట్రావు, నగర డిప్యూటీ మేయర్గా తాడిశెట్టి మురళీ పని చేశారు. వీరిద్దరూ వైసీపీపై అసంతృప్తితో పార్టీని వీడుతున్నారు. ఈ నెల 19న తాడికొండ సోదరుల ఆత్మీయ సమావేశం జరగనుంది.
ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ.. వైసీపీలో తమకు కనీస గుర్తింపు లేదన్నారు. తమ అనుచరులకు ప్రాధాన్యమివ్వడం లేదన్నారు. వైసీపీలో దళారులు ఉన్నారన్నారు. జగన్ కలవడం కంటే వేంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతుందని మురళి పేర్కొన్నారు. అత్మీయ సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకుని.. భవిష్యత్లో ఏపార్టీలోకి వెళ్లాలో డిసైడ్ చేసుకుంటామని వెల్లడించారు.
Updated Date - Feb 17 , 2024 | 12:03 PM