ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPI : ఏపీ ప్రజలకు జగన్‌ పీడ విరగడైంది

ABN, Publish Date - Jun 23 , 2024 | 05:06 AM

ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పీడ విరగడై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విముక్తి దొరికిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

జగన్‌ పాలనలోని దుర్మార్గాలతో పోల్చితే

ఎన్నికల అనంతర ఘటనలు చిన్నవి: నారాయణ

న్యూఢిల్లీ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఇటీవలి ఎన్నికల ఫలితాలతో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పీడ విరగడై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు విముక్తి దొరికిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శనివారం, ఇక్కడ ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనలో జరిగిన దుర్మర్గాల కంటే ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘటనలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డారు. ఏపీలో టీడీపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందిస్తూ... వైసీపీ నేర్పిన విద్యయే కదా..! అంటూ ఎద్దేవా చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కక్షసాధింపు చర్యలకు దిగకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు.

Updated Date - Jun 23 , 2024 | 05:52 AM

Advertising
Advertising