ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Joining TDP టంగుటూరు సర్పంచ టీడీపీలో చేరిక

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:25 AM

మండలంలోని టంగుటూరు గ్రా మ పంచాయతీ సర్పంచ మైను ద్దీన దాదాపు వంద కుటుంబాల తో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.

టీడీపీలో చేరిన మైనుద్దీనను అభినందిస్తున్న మేడా విజయశేఖర్‌ రెడ్డి

నందలూరు, సెప్టెంబరు 20 మండలంలోని టంగుటూరు గ్రా మ పంచాయతీ సర్పంచ మైను ద్దీన దాదాపు వంద కుటుంబాల తో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. ఈ సందర్భంగా మైనుద్దీన మాట్లాడు తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ ఆశయాలు నచ్చి టీడీపీలో చేరాన ని, టంగుటూరు గ్రామంలో తెలుగుదేశంపార్టీ బలోపేతా నికి తమవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మేడా విజయశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పింఛను పెంచుతామన్న హామీని నిలబెట్టుకున్నారని, వలంటీర్లు లేకపోయినా ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు ఇంటివద్దే అందజేస్తున్నారన్నారు. 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదలైందని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేసి రైతుల భయాన్ని పోగొట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనబోయిన లక్ష్మీనరసయ్య, టంగుటూరు ఎంపీటీసీ సభ్యుడు పెంచలయ్య, మండల టీడీపీ అధ్యక్షురాలు షర్మిల, ఏపీ ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి కొండయ్య, లేబాక సర్పంచ నరసయ్య, హరి, మదనమోహనపురం చుక్కా యానాది, ఆడపూరు బాబురాజు, కుంపిణీ పురం చంద్రశేఖర్‌, వెంకట సుబ్బారెడ్డి, ఎల్లమరాజుపల్లె శ్రీనివాసులరెడ్డి, గుగ్గిళ్ల సుబ్బ రాయుడు, చుక్కా కొండయ్య, వెంకటేశ, వెంకటరత్నం, తోట కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:25 AM