ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ప్రత్యేక విమానంలో ముంబైకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

ABN, Publish Date - Oct 10 , 2024 | 11:26 AM

Andhrapradesh: రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం 11:45 గంటలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లనున్నారు.

CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 10: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) అనారోగ్యంతో కన్నుమూశారు. రతన్ టాటా మృతిపట్ల ప్రధాన మోడీ (PM Modi) సహా ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా టాటా మృతిపట్ల సంతాపం తెలిపారు. అలాగే రతన్ టాటా మృతి నేపథ్యంలో ముంబై వెళ్లాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) నిర్ణయించారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ (Minister Lokesh) కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా పార్థివదేహానికి ఇరువురు నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం 11:45 గంటలకు వెలగపూడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లనున్నారు. 12 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకోనున్న సీఎం చంద్రబాబు, లోకేష్... 3 గంటలకు నారిమన్ పాయింట్‌లోని ఎన్‌సీపీఏ లాన్స్‌లో రతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించనున్నారు. తిరిగి 3:30 గంటలకు అమరావతికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌ నాలా ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు..


చంద్రబాబు సంతాపం..

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు. ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ, జాతి నిర్మాణం లోనూ, పరోపకారి గుణంలోనూ తరతారాలలో మార్పును తెచ్చిందని కొనియాడారు. ఆయన గొప్ప వారసత్వాన్ని మనకు వదిలి వెళ్ళారని, టాటా గ్రూప్‌కు, ఆయనను ప్రేమించేవారికి బాధా తప్త హృదయంతో సంతాపం తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక మాద్యమం ఎక్స్‌ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Ratan Tata: రతన్ టాటా జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలు! ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ..


మహా దార్శనికుడు రతన్ టాటా: లోకేష్

విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని మంత్రి లోకేష్ అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని, నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.


ఇవి కూడా చదవండి...

YS Jagan: హర్యానాపై సరే.. కశ్మీర్‌ సంగతేంది.. జగన్ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకున్నారా..

Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 10 , 2024 | 12:50 PM