ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devineni Uma: నిర్మాణం పేరుతో వైసీపీ దోపిడీ..: దేవినేని ఉమా

ABN, Publish Date - Feb 29 , 2024 | 10:36 AM

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్యాలెస్‌లు వెలిగిపోతుంటే.. పేదల గూళ్ళు కూలిపోతున్నాయన్నారు.

అమరావతి: టీడీపీ (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswararao) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అమరావతి (Amaravati)లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్యాలెస్‌లు వెలిగిపోతుంటే.. పేదల గూళ్ళు కూలిపోతున్నాయన్నారు. రుషికొండ (Rushikonda)కు గుండుకొట్టి వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేశారన్నారు. వైసీపీ నేతల (YCP Leaders) ధన దాహానికి గృహప్రవేశానికి ముందే పక్కా ఇళ్లు కూలిపోతున్నాయని మండిపడ్డారు. కేంద్ర నిధులతో పాటు లబ్ధిదారుడి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. తామే కట్టించి ఇస్తామని ఒక్కపైసా ఖర్చు పెట్టకపోగా.. నిర్మాణం పేరుతో దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం పనులతో లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. దోచుకో.. దాచుకో.. విధానంతో తాడేపల్లి ఖజానా నింపుకున్న వైయస్ జగన్ ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టారని దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

Updated Date - Feb 29 , 2024 | 01:12 PM

Advertising
Advertising