ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Somireddy: అలా చేస్తే భారతమ్మ ఇంట్లోకి రానీయదా.. జగన్‌కు సూటి ప్రశ్న

ABN, Publish Date - Sep 28 , 2024 | 01:15 PM

Andhrapradesh: జగన్‌కు మతి చెలించిందా లేక స్థిమితం తప్పిపోయిందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. దేశాన్ని, మతాల్ని ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారన్నారు. ‘‘కొవ్వెక్కి ఇదేం దేశం అంటావా.. భారతీయుడివి కాదనుకుంటే పాకిస్తాన్‌కో.. దుబాయ్ కో పోవాలి’’

MLA Somireddy Chandramohan Reddy

అమరావతి, సెప్టెంబర్ 28: ‘‘ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జగన్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan reddy) కూడా జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Bangalore: సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..



కొవ్వెక్కి ఇదేం దేశం అంటావా..

జగన్‌కు మతి చెలించిందా లేక స్థిమితం తప్పిపోయిందా అని ప్రశ్నించారు. దేశాన్ని, మతాల్ని ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారన్నారు. ‘‘కొవ్వెక్కి ఇదేం దేశం అంటావా.. భారతీయుడివి కాదనుకుంటే పాకిస్తాన్‌ కో.. దుబాయ్ కో పోవాలి. భారత పౌరడవై దేశాన్ని, హిందూ మతాన్ని కించపరచటానికి సిగ్గుండాలి’’ అంటూ ఫైర్ అయ్యారు. తిరుమలలో జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెడితే భారతమ్మ ఇంట్లోకి రానివ్వదనా లేక క్రైస్తవ ఓట్లు పోతాయని పర్యటన రద్దు చేసుకున్నావా అని నిలదీశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని వల్ల కాడు చేసిన జగన్ దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ తల్లి విజయమ్మ కొడుకుతో వేగలేకపోతున్నానంటూ రోశయ్య దగ్గ బోరుమందన్నారు. ఐదేళ్లు రాష్ట్రం జగన్‌తో వేగలేక చచ్చిందన్నారు. కన్న తల్లి, చెల్లినీ దూరం చేసుకున్నవాడు జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా దేశానికీ, హిందువులకూ జగన్ క్షమాపణలు చెప్పి ఓ మూల కూర్చోవాలని హితవుపలికారు.


అసలు వైసీపీ పరిస్థితి ఏంటి...

అసలు జగన్ పరిస్థితి, అతని పార్టీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఈ రోజుకీ పెద్దిరెడ్డి పుంగనూరుకు పోలేకపోతున్నారని.. మిథున్ రెడ్డి రాజంపేట వెళ్లట్లేదన్నారు. కొడాలినాని, వంశీ, రోజాలు నియోజకవర్గాలకు కాదు కదా కనీసం వారి జిల్లాలకు పోలేకపోతున్నారని తెలిపారు. సజ్జల, ధనుంజయ్ రెడ్డిలది అయితే అజ్ఞాతవాసమైతే, విజయసాయి విశాఖ వెళ్లలేకపోతున్నారన్నారు. జగన్ తాను పుట్టిన రాయలసీమలోని తిరుపతికి పోలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. జగన్ అడుగులకు మడుగులొత్తిన ఐపీఎస్‌లు సస్పెండ్ అయితే వాసుదేవరెడ్డి ఊచలు లెక్కపెడుతున్నాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..


దేశ బహిష్కరణ చేయాల్సిందే: మంత్రి రవికుమార్

అలాగే జగన్‌పై మంత్రి గొట్టపాటి రవికుమార్ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంప్రదాయాలు పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్‌ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలుంటాయని.. వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడవవుతావన్నారు. మత విశ్వాసాలు, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ.. జగన్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం బాధాకరమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది, వాటిని అడ్డం పెట్టుకుని దేశ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే దేశంలో ఉంటూ దేశ సంప్రదాయాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పేసరికి... ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశమన్నా... దేశ సంప్రదాయాలన్నా ఏమాత్రం గౌరవం లేదనే తన నైజాన్ని జగన్ బయటపెట్టుకున్నారన్నారు. దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరిచుస్తూ... భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి రవికుమార్ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

Kollu Ravindra: జగన్ తిరుమల పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే

Anitha: జగన్‌ను పులికేశితో పోలుస్తూ అనిత సెటైర్...

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 01:41 PM