ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Lokesh: శ్రీశైలంలో నారా లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Feb 01 , 2024 | 04:25 PM

Andhrapradesh: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , బ్రాహ్మణి గురువారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్ద లోకేష్, బ్రాహ్మణిలకు అర్చకులు, ఏఈవో హరిదాస్, అధికారులు స్వాగతం పలికారు.

నంద్యాల, ఫిబ్రవరి 1: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh), బ్రాహ్మణి ( Nara Brahmani) గురువారం దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయం రాజగోపురం వద్ద లోకేష్, బ్రాహ్మణిలకు అర్చకులు, ఏఈవో హరిదాస్, అధికారులు స్వాగతం పలికారు. లోకేష్ దంపతులు ధ్వజస్తంభానికి నమస్కరించి భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ దంపతులు వేద పండితుల వేద ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు లోకేష్ దంపతులకు అమ్మవారి ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

కాగా... శ్రీశైలం పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి సున్నిపెంట హెలిప్యాడ్‌కు లోకేష్ దంపతులు చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ దంపతులకు మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నందికొట్కూరు టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో సాక్షిగణపతి ఆలయానికి యువనేత చేరుకున్నారు. సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించిన లోకేష్... కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 01 , 2024 | 04:52 PM

Advertising
Advertising