ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mahasena Rajesh: పోటీ నుంచి తప్పుకున్న మహాసేన రాజేష్.. తెరవెనుక ఏం జరిగింది..!?

ABN, Publish Date - Mar 03 , 2024 | 03:17 AM

పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సరిపెల్ల రాజేశ్‌ (మహాసేన రాజేశ్‌) ప్రకటించారు..

  • టీడీపీ, జనసేనకు..

  • నష్టం జరగకూడదనే నిర్ణయం

  • పార్టీ తీసుకునే నిర్ణయానికి

  • కట్టుబడి ఉంటా: మహాసేన రాజేశ్‌

  • పోటీ నుంచి తప్పుకొంటున్నా: మహాసేన రాజేశ్‌

అమలాపురం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సరిపెల్ల రాజేశ్‌ (మహాసేన రాజేశ్‌) Mahasena Rajesh ప్రకటించారు. శనివారం సోషల్‌ మీడియాలో ఆయన ఓ వీడియోని పోస్ట్‌ చేశారు. దానిలో... ‘నా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏడేళ్ల క్రితం నేను విడుదల చేసిన ఒక వీడియోను సాకుగా చూపి బ్రాహ్మణులు విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఈ పరిణామాలు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు నష్టం కలిగించేలా ఉన్న దృష్ట్యా పోటీ నుంచి నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నా. నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా జగన్‌ చేస్తున్న కుట్రల్లో భాగమే ఈ పరిణామాలు. హిందూ వ్యతిరేకిగా నాపై ముద్ర వేస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంతో పార్టీకి నష్టం జరగకూడదని భావిస్తున్నా. కుల రక్కసి చేతిలో నేను బలయ్యా. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన తీసుకునే నిర్ణయం ఏదైనా నేను స్వాగతిస్తా’ అని రాజేశ్‌ తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 09:01 AM

Advertising
Advertising