ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mundlamur : అమెరికాలో ప్రకాశం టెకీ మృతి

ABN, Publish Date - Aug 19 , 2024 | 05:13 AM

ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అమెరికాలోని ఓ బీచ్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల ఏకైక కుమారుడు దద్దాల బుచ్చిబాబు(40) ఎంసీఏ పూర్తి చేశారు.

  • కాలిఫోర్నియా బీచ్‌లో ఈతకు వెళ్లి దుర్మరణం

  • 20 నెలల క్రితం యూఎ్‌సలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

  • 6 నెలల క్రితం భార్య, కుమారుడు కూడా అమెరికాకు

  • మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు: టీడీపీ

ముండ్లమూరు, ఆగస్టు 18: ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అమెరికాలోని ఓ బీచ్‌లో ఈతకు దిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరుకు చెందిన దద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల ఏకైక కుమారుడు దద్దాల బుచ్చిబాబు(40) ఎంసీఏ పూర్తి చేశారు. 20 నెలల క్రితం ఆయనకు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు.

ఆరు నెలల క్రితం భార్య, ఐదేళ్ల కుమారుడు నిఖిల్‌ అద్వైత్‌ చౌదరి కూడా అమెరికాకు వెళ్లారు. వీరు ముగ్గురూ శనివారం కాలిఫోర్నియాలోని బీచ్‌కి వెళ్లి కొద్దిసేపు సరదాగా సముద్రంలో స్నానం చేశారు.

సెల్ఫీలు దిగారు. ముగ్గురూ ఒడ్డుకు వచ్చిన తర్వాత బుచ్చిబాబు ఒంటరిగా ఈతకు దిగి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ముండ్లమూరులోని బుచ్చిబాబు తల్లిదండ్రులకు ఆదివారం ఈ సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ గొట్టిపాటి లక్ష్మి.. బుచ్చిబాబు తండ్రి కోటేశ్వరరావును ఫోన్‌లో పరామర్శించారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, గొట్టిపాటి రవికుమార్‌, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లతో మాట్లాడి త్వరగా మృతదేహాన్ని ముండ్లమూరుకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 05:13 AM

Advertising
Advertising
<