ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gudlavalleru College: హాస్టల్‌లో హిడెన్ కెమెరాల వెనుక కథ ఏంటి?

ABN, Publish Date - Aug 31 , 2024 | 10:00 AM

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమేంటి? ఈ మొత్తం వ్యవహారం ఉన్న కోణాలేంటి..? ఇందులో సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇంత జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • గుడ్లవల్లేరు కాలేజీలోని బాలిక వసతి గృహాల్లో కెమెరాలు పెట్టిందెవరు?

  • ఆ ప్రేమికులను ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేశారా?

  • మరో ప్రేమ వ్యవహారం ఏమైనా నడిచిందా?

  • యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది?

  • ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదెందుకు?

  • విద్యార్థినుల ఆందోళనతో కాలేజీలో ఉద్రిక్తత

  • ఆందోళన చేసిన వందలమంది విద్యార్థినులు

  • మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ హామీతో విరమణ

  • విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాల (Gudlavalleru Engineering College) బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు (Hidden Camera) ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమేంటి? ప్రేమికుల (Lovers) మధ్య ఉన్న ఆంతరంగిన వ్యవహారాలే దీనంతటికీ కారణమా? ఈ వ్యవహారాన్నే ఆధారంగా చేసుకుని ఒక గ్రూపునకు చెందిన విద్యార్థులు సదరు ప్రేమికులను బ్లాక్‌మెయిల్‌ చేశారా? లేక మరేమైనా ప్రేమకోణం దాగి ఉందా? ఇంతా జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఎన్టీఆర్ కృష్ణా జిల్లా/గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాల ఏర్పాటు వివాదం వందలమంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసింది. ఇంత జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఒక విద్యార్థినికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగానే యాజమాన్యానికి బెదిరింపులు ఎదురయ్యాయా అనే కోణం వెలుగుచూసింది. ఈ అంశంపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి విచారణకు ఆదేశించడంతో మరింత సంచలనంగా మారింది.


ప్రేమ వ్యవహారాలే కారణమా..?

కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారాలే ఈ హిడెన్‌ కెమెరాల ఏర్పాటుకు కారణమని తెలుస్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమికులిద్దరూ ప్రకాశం జిల్లాకు చెందినవారు. వీరి మధ్య పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ విషయం బయటకు రాకుండా కొందరు కావాలనే ఇలా చేయించారని చెబుతుండగా, తెరవెనుక మరో కథ కూడా నడిచిందని తెలుస్తోంది. సదరు ప్రేమికుడికి అదే కళాశాలకు చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరూ సరదాగా ఉండేవారు. ఒకరిళ్లకు ఒకరు వెళ్లేవారు. కొంతకాలానికి స్నేహితుడి చెల్లెలిని ప్రేమికుడు ప్రేమలోకి దించాడు. ఈ వ్యవహారం స్నేహితుడికి తెలిసి ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చాయి. మాటామాటా పెరిగి ‘నీ ప్రియురాలికి నువ్వు చేసిన వీడియో కాల్స్‌ స్క్రీన్‌ షాట్స్‌ నా దగ్గర ఉన్నాయి. వాటిని బయటపెడతాను’ అని స్నేహితుడు బెదిరించాడు. ఇందుకు నిందితుడు కూడా.. ‘నీ చెల్లితో నేను చేసిన చాటింగ్‌ స్క్రీన్‌షాట్లు బయటపెడతాను.’ అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. కాగా, నిందితురాలిని మరో స్నేహితుడు వన్‌సైడ్‌ లవ్‌ చేస్తుండగా, అతని ద్వారా ఈ హిడెన్‌ కెమెరాల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. సదరు నిందితురాలు ఈ వీడియోలను బయటకు పంపుతోందనే ఆరోపణలతో విద్యార్థినులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏబీవీపీ, మహిళా మోర్చా నాయకులు కూడా కళాశాలకు చేరుకోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది.


సంఘటనాస్థలానికి కలెక్టర్‌, ఎస్పీ

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు శుక్రవారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలకు వెళ్లారు. వివరాలు సేకరించారు. కాగా, వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారనే విషయాన్ని వారం క్రితమే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ చేయాలంటే నెల సమయం పడుతుందన్నారని విద్యార్థినులు మండిపడ్డారు. పైగా ఫిర్యాదు చేసిన తమపైనే కేసు పెడతామని బెదిరించారని అధికారులు, మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఘటనపై విచారణ చేసి విద్యార్థినులకు న్యాయం చేస్తామని, వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాల ఆచూకీ కనుగొనేందుకు ఎస్‌ఎస్‌జేడీ పరికరంతో పరిశీలించడానికి ప్రత్యేకబృందాన్ని నియమించామన్నారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని విద్యార్థినులు డిమాండ్‌ చేయగా, అనుమానితులను ఇక్కడకు తీసుకొస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, పూర్తిస్థాయి విచారణచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఎంతటి వారినైనా వదిలిపెట్టం..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని, ఈ సంఘటనకు పాల్పడినవారు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని విద్యార్థినులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్‌, యార్లగడ్డ వెంక ట్రావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా మాట్లాడుతూ తన మేనకోడలు కూడా అక్కడే చదువుతోందని, తాను కూడా బాధిత కుటుంబానికి చెందినవాడినేనన్నారు. కాగా, ఆందోళన చేస్తున్న తమపై పరీక్షలు, మార్కుల పేరిట యాజమాన్యం వేధించే అవకాశం ఉందని విద్యార్థినులు ఆందోళన చెందగా, అలాంటిదేమీ ఉండదంటూ యాజమాన్యం ద్వారా అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇప్పించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ వార్డెన్‌ను సస్పెండ్‌ చేస్తామని కళాశాల ప్రతినిధులు ప్రకటించారు.


ఆందోళన విరమణ..

వీడియోలు బయటకు రానివ్వబోమని మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. మంగళవారంలోగా విచారణను పూర్తిచేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. వసతి గృహంలో విద్యార్థినులకు రక్షణగా మహిళా పోలీసులతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆందోళన విరమించిన విద్యార్థినులు.. విచారణ పూర్తయ్యే వరకు తరగతులకు హాజరుకాబోమని చెప్పారు.

విచారణలో వాస్తవాలు తెలుస్తాయి

హాస్టల్‌లోని వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఉన్నాయని కళాశాల యాజమాన్యం నమ్మడం లేదు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయి. తప్పుచేసిన వారికి చట్టప్రకారం శిక్ష పడుతుంది. విచారణ అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయిస్తాం. వాష్‌రూమ్‌ల్లో హిడెన్‌ కెమెరాలు ఉన్నాయనే విషయం విద్యార్థినుల ఆందోళనతోనే మా దృష్టికి వచ్చింది. – వల్లూరుపల్లి సత్యనారాయణరావు, కళాశాల సెక్రటరీ

Updated Date - Aug 31 , 2024 | 10:00 AM

Advertising
Advertising